ఎండు ద్రాక్ష ఉపయోగాలు తెలిస్తే తినకుండా ఉండలేరు..!

By సుభాష్  Published on  28 April 2020 1:11 PM GMT
ఎండు ద్రాక్ష ఉపయోగాలు తెలిస్తే తినకుండా ఉండలేరు..!

ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నో ఆనారోగ్య సమస్యలు వస్తున్నాయి. మానసిక ఒత్తిళ్లు, సమయానికి తినకపోవడం, నిద్రలేమి, మనం తినే ఆహారం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. కొన్ని కొన్ని నియమాలు పాటిస్తే ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు.

ఇక ఎండుద్రాక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. వీటి వల్ల యాంటీయాక్సిడెంట్లు, పీచు పదార్థం ఉండటం వల్ల రక్తహీనతను దూరం చేస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపర్చే శక్తి ద్రాక్షలో ఉంది. క్రమం తప్పకుండా రోజు ఐదారు తిసుకుంటే చిన్న పేగుల్లో ఉండే వ్యర్థ పదార్థాలను బయటకు పంపించేస్తుంది.

ఎండు ద్రాక్షలో ఉండే పీచు ఉండటం వల్ల కడుపులోని నీటిని పీల్చేస్తుంది. తద్వారా విరేచనాలు, ఉదర సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. ముఖ్యంగా స్త్రీలకు ఇవి ఎంతో ఉపయోగపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ద్రాక్ష పండ్లను ఎండబెట్టినప్పుడు ఎండు ద్రాక్ష తయారవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే ద్రాక్షలో 70 నుంచి 80 శాతం వరకూ వైన్‌ తయారీలో ఉపయోగిస్తుంటారు. ఇందులో మంచి పోషక విలువలు కలిగి ఉంటాయి. కొన్ని రకాల వ్యాధులను దూరం చేస్తుంది ఎండుద్రాక్ష. వీటి వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. క్రీడలు ఆడేవారు ఎండుద్రాక్ష తీసుకోవడం ఎంతో మేలు. హైబీపీ, క్యాన్సర్‌ దరిచేరకుండా ఎంతో ఉపయోగపడతాయి. వీటిలోని యాంటీయాక్సిడెంట్లు క్యాన్సర్‌ కణాలను దూరం చేస్తాయి. హైబీపీని కంట్రోల్లో పెడుతుంది.

రక్తకణాల ఉత్పత్తికి ఎంతగానో ఉపకరిస్తాయి

ఎండుద్రాక్షల్లో పొటాషియం రక్తనాళ్లాల్లో ఒత్తిడిని తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇంకా వీటిలో విటమిన్‌ బి కాంప్లెక్స్‌, ఐరన్‌ ఉండటం ద్వారా రక్తకణాల ఉత్పత్తికి ఎంతగానో ఉపకరిస్తాయి.

పిల్లలు రాతప్రూట పక్క తడుపుతుంటే..

పిల్లలు రాతప్రూట పక్క తడుపుతుంటే వారికి వారం పాటు ప్రతిరోజూ రాత్రి రెండు ఎండు ద్రాక్షలను ఇవ్వండి. ఈ వారంలో వారికి చలవచేసే వస్తువులు, పెరుగు, మజ్జిగలాంటి పదార్థాలను ఇవ్వకండి. దీంతో పక్క తడిపే అలవాటు పూర్తిగా మానిపోతుంది.

గొంతు వ్యాధితో బాధపడేవారు

గొంతు వ్యాధితో బాధపడేవారు ఎండు ద్రాక్షను తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది . ఎందుకంటే ఈ ఎండు ద్రాక్ష శరీరంలోని శ్వాసనాళికలో పేరుకుపోయిన కఫాన్ని తొలగిస్తుంది. అలాంటి వారికి ఎంతో ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Next Story