ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నకిలీ కరెన్సీ ముద్రించే ముఠాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సత్తుపల్లి మండలం గౌరీగూడెంనికి చెందిన షేక్ మదార్ తన అనుచురులతో.. తమ వద్ద రూ. 100 కోట్లకు పైగా 2000 నోట్ల కట్టల బ్లాక్ మనీ ఉన్నదని.. దానిని వైట్ మనీగా మారిస్తే.. రూ. 80 కోట్లు ఇస్తే రూ. 100 కోట్లు ఇస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. సమాచారం మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 7కోట్లు నకలి కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.