కళ్యాణ్ రామ్ 'ఎంత మంచివాడవురా' ఎంత వరకు వచ్చింది..?
By Newsmeter.Network
నందమూరి కళ్యాణ్రామ్, మెహరీన్ జంటగా భారీగా తెరకెక్కుతున్న చిత్రం 'ఎంత మంచివాడవురా'. ఈసినిమా షూటింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని విడుదలకు ముస్తాబవుతోంది. ఆడియో రంగంలో అగ్రగామి ఆదిత్యా మ్యూజిక్ సంస్థ. ఈ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగింది. ఆదిత్యా మ్యూజిక్ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 'శతమానం భవతి' చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్ వేగేశ్న దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. దీని పాటలను డిసెంబరులో విడుదల చేయనున్నట్లు సమాచారం.
సంక్రాంతి సందర్భంగా జనవరి 15న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పాటలకు ఎంతో ప్రాధాన్యముండేలా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర్ స్వరకల్పన చేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఒక పాట, రామజోగయ్య శాస్ర్తి రెండు పాటలు, శ్రీమణి ఒక పాట రాశారు. ఇందులో నాలుగు పాటలు, నాలుగు ఫైట్లు ఉంటాయని దర్శకుడు సతీష్ వేగేశ్న తెలిపారు. క్లైమాక్స్ లో వచ్చే ఫైట్ ను ఖర్చుకు వెనుకాడకుండా చాలా రిచ్ గా తీశామని, గోదావరి నదిలో సాహోసోపేతంగా చిత్రీకరించిన ఈ సన్నివేశాల విషయంలో ఫైట్ మాస్టర్ వెంకట్ రిస్క్ తీసుకున్నారని వివరించారు.
నిర్మాత ఆదిత్య ఉమేష్ గుప్తా మాట్లాడుతూ...
సినిమా షూటింగ్ కారక్రమాలు పూర్తయ్యాయన్నారు. జనవరి 15న విడుదల చేయనున్నామని చెప్పారు. డబ్బింగ్ కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయన్నారు. ''కళ్యాణ్ రామ్, సతీష్ వేగేశ్న కాంబినేషన్ లో వచ్చే ఈ చిత్రం భారీ విజయాన్ని సాధిస్తుందన్నారు. టీజర్కి అద్భుతమైన స్పందన లభిస్తోందని తెలిపారు. ఆడియో రంగంలో మా సంస్థ ఎలా దూసుకుపోయిందో చిత్ర నిర్మాణ రంగంలోనూ ఆ ఒరవడిని కొనసాగిస్తుందన్నారు. డిసెంబరు 1 నుంచి రీరికార్డింగ్ ప్రారంభమవుతుంది ''అని చెప్పారు.