రోహింగ్యాలపై డ్రోన్‌ దాడి... వంద మందికిపైగా మృతి..!

బంగ్లాదేశ్‌లో కొన్నాళ్లుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla
Published on : 11 Aug 2024 11:50 AM IST

drone attack,  rohingya muslims, hundred people died,

రోహింగ్యాలపై డ్రోన్‌ దాడి... వంద మందికిపైగా మృతి..!

బంగ్లాదేశ్‌లో కొన్నాళ్లుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. రిజర్వేషన్ల కోసం ఆందోళనలు జరుగుతున్నాయి. హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు. ఆ తర్వాత కూడా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని వర్గాల ప్రజలపై దాడులు జరుగుతున్నాయి. అయితే.. ఈ దేశం ముందు మరో సవాల్ నిలిచింది. తాజాగా మయన్ఆర్‌ నుంచి పెద్ద సంఖ్యలో రోహింగ్యా ముస్లింలు ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారు.

మయన్మార్ నుంచి బంగ్లాదేశ్‌లోకి పెద్ద ఎత్తున ముస్లింలు వస్తున్నారు. ఈ క్రమంలోనే తరలివస్తోన్న రోహింగ్యా ముస్లింలపై డ్రోన్ దాడి జరిగింది. ఈ సంఘటనలో వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ సంఖ్యలో మహిళలు, చిన్నారులే ఉన్నారని సమాచారం. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దాంతో.. ఈ ఉదంతం సంచలనంగా మారింది. బురదతో కూడిన పొలంలో పెద్ద సంఖ్యలో మృతదేహాలు పడి ఉన్నాయి. ఈ మృతదేహాల చుట్టూ సూట్‌కేసులు, బ్యాక్‌ప్యాక్‌లు ఉన్నాయి.

వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. నలుగురు ప్రత్యక్ష సాక్షులు ఈ డ్రోన్ దాడుల గురించి మీడియాకు తెలిపారు. బంగ్లాదేశ్‌ సరిహద్దు దాటేందుకు ప్రయత్నిస్తున్న కుటుంబాలపై ఈ దాడి జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ దాడి రోహింగ్యా పౌరులపై జరిగిన అత్యంత పాశవిక దాడిగా పేర్కొన్నారు. ఈ దాడుల వెనుక అరకాన్ ఆర్మీ హస్తం ఉందని చెబుతున్నారు. అయితే.. ఈ ఆరోపణలను అరకాన్ ఆర్మీ ఖండించింది. ఈ దాడిపై మయన్మార్, మిలీషియా పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. మరి ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు ఎప్పటివి..? నిజంగా ఇటీవల జరిగిన దాడేనా? లేదంటే పాత విజువల్సా? అనేది తెలియాల్సి ఉంది.


Next Story