14 నుంచి ఇంద్రకీలాద్రి పై సంక్రాంతి సంబరాలు

By Newsmeter.Network  Published on  13 Jan 2020 10:24 AM GMT
14 నుంచి ఇంద్రకీలాద్రి పై సంక్రాంతి సంబరాలు

విజయవాడ : ఈ నెల 14 నుంచి 16 వరకు ఇంద్రకీలాద్రి పై సంక్రాంతి సంబరాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు దుర్గగుడి ఈవో ఎంవి.సురేష్ బాబు తెలిపారు. రేపు ఉదయం 6 గంటలకు బోగి మంటలతో పాటు అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామ‌న్నారు.ఉదయం 10 గంటలకు వృద్ధాశ్రమంలో ఉన్న దుర్గమ్మ కు అమ్మవారి దర్శనానికి తీసుకువచ్చి అమ్మవారి వారి చీర అందజేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ నెల30 న శ్రీ పంచమి సందర్భంగా‌ అమ్మవారు శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం కల్పిస్తున్నామ‌ని, ఆ‌రోజు విద్యార్ధులకు అమ్మవారి ఉచిత దర్శనం కల్పించ‌నున్న‌ట్లు చెప్పారు.

ఈ నెల 31 న సివి రెడ్డి వర్ధంతి కావడంతో 100 మందికి స్కాలర్ షిప్పులు ఇస్తున్నామ‌ని, ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ దర్శనార్దం వచ్చే భక్తులు సాంప్రదాయ‌ దుస్తుల్లోనే రావాలని సూచించారు. రూ.300 టిక్కెట్ ను ఆన్ లైన్ లో బుక్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామ‌ని, కొండపైన అర్జునుడు ప్రతిష్టించిన ఆలయానికి భక్తులను అనుమతించే మార్గంపై ప్రతిపాదన సిద్ధం చేస్తున్నాం..త్వరలోనే భక్తులకు ఆ వెసులుబాటు కల్పిస్తామ‌న్నారు. కేశఖండన శాల, ప్రసాదం పోటు శాశ్వత భవనాలకు త్వరలోనే శంకుస్ధాపనకు శ్రీకారం చుడుతున్నామ‌ని పేర్కొన్నారు. అమ్మవారికి పులిహోర ప్రసాదాన్ని ఐదు రూపాయల నుంచి 10 రూపాయలకు పెంచే యోచనలో ఉన్నట్లు తెలిపారు.

Next Story