భారత్‌లో 118,447 కరోనా కేసులు

By సుభాష్  Published on  22 May 2020 7:12 AM GMT
భారత్‌లో 118,447 కరోనా కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు కరోనాను ఎంత కట్టడి చేసినా.. కేసుల సంఖ్య పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో 6,088 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా, ఒక్క రోజులోనే 6వేలకుపైగా కేసులు నమోదు కావడం మొదటిసారి. కొత్తగా నమోదైన కేసులతో కలిపి భారత్‌లో ఇప్పటి వరకూ 118,447కు చేరింది. గత 24 గంటల్లో 148 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో భారత్‌లో ఇప్పటి వరకూ మరణించిన వారి సంఖ్య 3583కు చేరుకుంది.

ఇక భారత్‌లోఇప్పటి వరకూ 48,533 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 66,330 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు భారత ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల్లో మహారాష్ట్రలో అత్యధికంగా నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో నిన్న ఒక్క రోజే 2వేలకుపైగా కరోనా కేసులు నమోదు కావడం మరింత భయాందోళన కలిగిస్తోంది. అంతేకాదు గురువారం ఒక్క రోజే 60మందికిపైగా మరణించారు. ఇక మహారాష్ట్ర తర్వాత తమిళనాడులో కరోనా ఎక్కులు అత్యధికంగా నమోదువుతున్నాయి.

లాక్‌డౌన్ అమలవుతున్నప్పటికీ కేసుల సంఖ్య పెరగడం మరింత ఆందోళన కలిగిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్‌ ప్రపంచ దేశాలను సైతం వణికిస్తోంది. మొదట్లో భారత్‌లో కేసులు నెమ్మదిగా ఉన్నా.. ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కజ్‌ ఉదంతం తర్వాత కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇప్పటి నుంచి భారత ప్రభుత్వం మరింత అప్రమత్తమై ఎన్నో జాగ్రత్తలు చేపడుతున్నా.. కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

Next Story