ఒలింపిక్స్‌కు ఒక్క అడుగు దూరంలో భారత్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Nov 2019 5:54 PM GMT
ఒలింపిక్స్‌కు ఒక్క అడుగు దూరంలో భారత్..!

భువనేశ్వర్ : భారత పురుషులు, మహిళల హాకీ జట్ల కష్టానికి అదృష్టం కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. ఒలింపిక్స్ బెర్త్ సాధించడానికి రెండు జట్లు ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నాయి. ఒలింపిక్ క్వాలిఫయిర్స్ మ్యాచ్‌లో రష్యాపై పురుషుల హాకీ జట్టు 4-2 తేడాతో విజయం సాధించింది. ఫస్ట్ 5 నిమిషాల్లో నే హర్మన్ ప్రీత్ గోల్ కొట్టేశాడు. 20వ నిమిషంలో మన్ దీప్ గోల్ కొట్టాడు. ఇక రెండో అర్ధభాగంలో సునిల్, మన్ ప్రీత్ చెరో గోల్ కొట్టడంతో 4-1 తో భారత్ పూర్తి ఆధిక్యంలోకి వెళ్లి పోయింది. చివరిలో రష్యా ఆటగాడు గోల్ కొట్టి భారత్ ఆధిక్యతను 4-2కు తగ్గించాడు.

మహిళా క్వాలిఫయిర్స్ మ్యాచ్‌లో అమెరికాను భారత్ 5-1 తేడాతో మట్టి కరిపించింది. తొలి అర్ధభాగంలో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.రెండో అర్ధబాగంలో రాణి సేన దడదడ లాడించింది .11 నిమిషాల్లోనే నాలుగు గోల్స్ కొట్టింది.రేపు జరిగే మ్యాచ్‌ల్లో ప్రత్యర్ధులను ఓడించినా..మ్యాచ్‌ను డ్రాగా ముగిసినా భారత్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది

Next Story