సూర్యాపేట: హుజూర్ నగర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి చంద్రయ్య నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ రోజు నుంచే నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 30 నామినేషన్లకు చివరి తేదీ. అక్టోబర్ 1 నామినేషన్ పరిశీలన ఉంటుంది. 3న ఉపసంహరణ. 21న పోలింగ్ ఉంటుందని రిటర్నింగ్ అధికారి చంద్రయ్య తెలిపారు.