హుజూర్ నగర్: ఉప ఎన్నిక వేడెక్కింది. నామినేషన్లకు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకే సమయం ఉండటంతో అన్ని పార్టీల నేతలు క్యూ కట్టారు. పలు పార్టీల నేతలు నామినేషన్లు వేశారు. దీంతో నామినేషన్ల కార్యాలయం దగ్గర సందడి వాతావరణం నెలకొంది. ఎటుంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.