ఆ ఆస్పత్రిలో శవం ఒంటిపై బంగారం మాయం
By Newsmeter.Network Published on 28 Nov 2019 9:02 AM GMT![ఆ ఆస్పత్రిలో శవం ఒంటిపై బంగారం మాయం ఆ ఆస్పత్రిలో శవం ఒంటిపై బంగారం మాయం](https://telugu.newsmeter.in/wp-content/uploads/2019/11/Hospital-Staff-copy.jpeg.jpg)
హైదరాబాద్: తిరుమలగిరి లోటస్ ఆస్పత్రిలో దారుణం వెలుగు చూసింది. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన ఓ పేషెంట్ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద ఆందోళన దిగారు. మృతురాలిపై ఉన్న ఆభరణాలను ఆసుపత్రి సిబ్బంది దొంగిలించారంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. అనంతరం కేసు నమోదు చేశారు. అయితే ఫీజుల విషయమై ఏమైనా జరిగి ఉంటుందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story