'క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప రెడ్లు ' చిత్రానికి హైకోర్ట్ బ్రేక్..!

By Newsmeter.Network  Published on  28 Nov 2019 11:03 AM GMT
క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప రెడ్లు  చిత్రానికి హైకోర్ట్ బ్రేక్..!

వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన తాజా చిత్రం 'క‌మ్మ‌రాజ్యంలో క‌డ‌ప రెడ్లు'. ఈ చిత్రాన్ని ఈ నెల 29న అన‌గా రేపు రిలీజ్ చేయాల‌నుకున్నారు. అయితే.. ఇప్పటి వరకు చిత్రానికి సెన్సార్ ఇవ్వలేదన్న సోలిసిటర్ జనరల్ రాజేశ్వర్ రావు తెలిపారు. వారం రోజుల్లో సినిమా ను చూసి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డు కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అయితే సినిమాలోని వివాదాలను పరిష్కరించి అభ్యంతరాలను స్వీకరించాలని సెన్సార్ బోర్డ్ కి హైకోర్ట్ సూచించింది. రెండు కులాల మధ్య చిచ్చు రగిలించిన‌ టైటిల్ను మార్చాలన్న హైకోర్టు ఆదేశించింది. కాగా..ఇప్పటికే టైటిల్ ను మార్చమని రామ్ గోపాల్ వర్మ కోర్టుకి తెలియ‌చేశారు. సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాల‌ని కోర్టును రామ్ గోపాల్ వర్మ కోరారు.

Next Story