మీ అందరి కోసం 'ఢిల్లీ' మళ్ళీ వస్తాడు- యాంగ్రీ హీరో కార్తీ
By న్యూస్మీటర్ తెలుగు
యాంగ్రీ హీరో కార్తీ కథానాయకుడిగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఎస్.ఆర్.ప్రకాష్బాబు, ఎస్.ఆర్.ప్రభు, తిరుప్పూర్ వివేక్ నిర్మించిన డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ 'ఖైదీ'. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి ఆర్ట్స్ కె.కె.రాధామోహన్ సమర్పించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజై అన్నిచోట్ల నుండి అద్భుతమైన రెస్పాన్స్తో హౌస్ ఫుల్ కలెక్షన్స్ సాధిస్తోన్న ఈ సినిమా పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
హీరో మహేష్ బాబుకి థాంక్స్: యాంగ్రీ హీరో కార్తీ
యాంగ్రీ హీరో కార్తీ మాట్లాడుతూ -' ఖైదీ' చిత్రం పట్ల మీరు చూపించే ప్రేమ, మీరు అందించిన ప్రశంసలకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. ఒక ఎగ్జైటింగ్ స్టోరీని మీకు అందించాలనే లక్ష్యంతో నేను మా టీమ్ మనసు పెట్టి హార్డ్ వర్క్ చేశామన్నారు. కానీ మేము ఈ స్థాయిలో రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేదన్నారు. మా చిత్రాన్ని చూసి అభినందించిన మహేష్ బాబుకి థాంక్స్ చెప్పారు. తన ప్రశంసలతో టీమ్ అంతా థ్రిల్ అయ్యారన్నారు. ఈ సినిమాని అభినందిస్తూ అందరిలోకీ తీసుకెళ్ళిన మీడియా వారికి ధన్యవాదాలు తెలిపారు. ఇంత గొప్ప విజయాన్ని అందించినందుకు అభిమానులకి, ప్రేక్షకులకి హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి కోసం 'ఢిల్లీ మళ్ళీ వస్తాడు'. అన్నారు.