కరోనా వైరస్‌: హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసిన ఏపీ సర్కార్‌

By సుభాష్  Published on  10 April 2020 5:22 AM GMT
కరోనా వైరస్‌: హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసిన ఏపీ సర్కార్‌

ఏపీలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రాష్ట్రంలో నిన్నరాత్రి 9 నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో అనంతపురం జిల్లాకు చెందిన రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేసింది. కొత్తగా నమోదైన రెండు కేసులతో మొత్తం 365కు చేరుకున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 892 కోవిడ్‌ పరీక్షలు నిర్వహించగా, అందులో 17 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు తెలిపింది.

రాష్ట్రంలో నమోదైన 365 పాజిటివ్‌ కేసులకు గానూ 10 మంది డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందారు. ప్రస్తుతం 349 మంది చికిత్స పొందుతున్నారు.

ఇక ఈ పాజిటివ్‌ కేసుల్లో 75 కేసులతో కర్నూలు మొదటి స్థానంలో ఉండగా, 51 కేసులతో గుంటూరు రెండో స్థానంలో, 48 కేసులతో మూడో స్థానంలో నెల్లూరు జిల్లా ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

Ap1

Next Story