గ్రీన్ ఛాలెంజ్లో..అలీ, కృష్ణ భగవాన్, రఘుబాబు
By Newsmeter.Network Published on 29 Nov 2019 12:19 PM GMTతెలంగాణ ప్రభుత్వ హరితహారం కార్యక్రమం విజయవంతంగా సాగుతుంది. దీనికి ఆదర్శంగా 'కార్యక్రమం హరా హైతో భరా'.. అనే పిలుపుతో అన్ని వర్గాలను ఆకట్టుకుంటున్న గ్రీన్ ఛాలెంజ్ మాకెంతో స్పూర్తి నింపిందని హాస్య నటులు అలీ, కృష్ణ భగవాన్, రఘబాబు అన్నారు. రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా.. కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్లోని జీహెచ్ఎంసీ పార్క్ లో మొక్కలు నాటారు.
ఈ గ్రీన్ ఛాలెంజ్ లో ప్రతి వ్యకి 3మొక్కలు చొప్పున నాటి తిరిగి మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించాలన్నారు. మొక్కలను నాటాలనే ముఖ్యమంత్రి కెసీఆర్ హరిత హారం సంకల్పానికి తనవంతుగా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టడం సంతోషంగా వుందన్నారు.
ఇఫ్పటికి కోట్ల కు పైగా చేరుకోవడం గర్వకారణం. మనిషి తనను తాను రక్షించుకోవాలంటే ప్రకృతిని రక్షించాల్సిందేననే మహోన్నత లక్ష్యం. దీనిలో భాగంగా, సంతోష్ కుమార్ తన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని
నటులను ప్రజలు ఆదర్శంగా తీసుకుంటారు. కాబట్టి, మా అభిమానులకు స్పూర్తిగా నిలువాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్నామన్నారు. వనాలను పెంచడం అనే కార్యక్రమంలో పాల్గొనడం మా అందరికి ఎంతో సంతృప్తి ఇచ్చిందని అలీ, కృష్ణ భగవాన్, రఘబాబు తెలిపారు.