గోపీచంద్, తమన్నా జంటగా సిల్వర్ స్క్రీన్ భారీ చిత్రం..!
By న్యూస్మీటర్ తెలుగు Published on 3 Oct 2019 11:43 AM GMTహైదరాబాద్ : మ్యాచోస్టార్ గోపీచంద్, తమన్నాజంటగా మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ భారీ చిత్రం ప్రారంభమైంది. మ్యాచోస్టార్ గోపీచంద్ హీరోగా మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. 'యు టర్న్'లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన సిల్వర్ స్క్రీన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
హై బడ్జెట్తో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం తీయనున్నట్లు సమాచారం. మిల్కీబ్యూటీ తమన్నా ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రం ముహూర్తపు షాట్కి సూపర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను క్లాప్ కొట్టగా, రాజమండ్రి ఎంపి మార్గాని భరత్రామ్ కెమెరా స్విచాన్ చేశారు. ఈ కార్యక్రమంలో భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, అగ్ర నిర్మాత అనీల్ సుంకర, ప్రముఖ నిర్మాత కె.కె. రాధామోహన్, యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
మ్యాచోస్టార్ గోపీచంద్ మాట్లాడుతూ – ”శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ శ్రీనివాస్గారితో, పవన్గారితో ఫస్ట్టైమ్ వర్క్ చేస్తున్నాను. వాళ్లు నాకు చాలాకాలంగా తెలుసు. కొన్ని స్టోరీస్ అనుకున్నాం కాని.. ఈ స్టోరీ పర్ఫెక్ట్గా కుదిరింది. ఒక మంచి స్టోరీతో, మంచి సినిమా చేయాలనే తపన ఉన్న ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్తో సినిమా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ‘గౌతమ్ నందా’ తర్వాత సంపత్ ఒక సూపర్ స్క్రిప్ట్తో వచ్చారు. మళ్ళీ సంపత్తో వర్క్ చేయడం హ్యాపీ. తమన్నాతో ఫస్ట్టైమ్ సినిమా చేస్తున్నాను. మా ఇద్దరి కాంబినేషన్ స్క్రీన్మీద బాగుంటుందని అనుకుంటున్నాను. తనది కూడా ఈ సినిమాలో మంచి క్యారెక్టర్. ఆమె కూడా చాలా ఎగ్జయిటింగ్గా ఉంది. డిఓపి సౌందర్ రాజన్ ‘గౌతమ్ నందా’లో చాలా బాగా చూపించారు. మంచి టీమ్తో, అద్భుతమైన కథతో ఈ సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది.” అన్నారు.
మాస్ డైరెక్టర్ సంపత్ నంది మాట్లాడుతూ – ”ఈరోజు ఈ మూవీ లాంచ్ అవడానికి 1 టు 10 రీజన్స్ మా హీరో గోపీచంద్గారే. ఫస్ట్టైమ్ నేను ఒక స్పోర్ట్స్ బేస్డ్ సినిమా చేస్తున్నాను. దానికోసం చాలా రీసెర్చ్ చేశాను. గోపీగారు ఆంధ్రాకి లీడ్ చేసే ఫీమేల్ కబడ్డీ టీమ్కి కోచ్గా చేస్తున్నారు. తెలంగాణ ఫీమేల్ కబడ్డీ టీమ్ కోచ్గా తమన్నా చేస్తున్నారు. 25 మంది బ్యూటిఫుల్ ప్లేయర్స్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. బలమైన కథతో, విజువల్స్తో, ఎమోషన్స్తో ఫస్ట్టైమ్ ఈ కథ చేస్తున్నాని "చెప్పారు
మిల్కీబ్యూటి తమన్నా మాట్లాడుతూ – ”సంపత్నందిగారితో నా మూడో సినిమా. మంచి కంటెంట్ ఉన్న సబ్జెక్ట్. గోపీచంద్గారితో సినిమా చెయ్యాలని చాలారోజులుగా ఎదురు చూస్తున్నాను. ఇప్పటికి మంచి టీమ్తో మంచి కథ కుదిరినందుకు హ్యాపీగా ఉంది. నాకు అవకాశం ఇచ్చిన శ్రీనివాస్, పవన్గార్లకి థాంక్స్. సంపత్గారితో వర్క్ కంఫర్ట్గా ఉంటుంది. పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్. తప్పకుండా ఒక హార్ట్ఫెల్ట్ సినిమా అవుతుందని నమ్ముతున్నాను” అన్నారు.