దిగొచ్చిన జియో..కొత్త ఎత్తుగడలతో మార్కెట్‌లోకి..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  21 Oct 2019 9:48 AM GMT
దిగొచ్చిన జియో..కొత్త ఎత్తుగడలతో మార్కెట్‌లోకి..!

ముంబై: జియో కొత్త నెలవారి ప్రణాళికను ప్రకటించింది. ఇటీవల నిమిషానికి 6 పైసల చార్జీ విధించిన సంగతి తెలిసిందే .అయితే..దీనిపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి.దీంతో టెలికాం సంస్ధ జియో దిగొచ్చింది. అంతేకాదు..వినియోగదారులను ఆకట్టు కోవడానికి కొత్త ప్రణాళికతో మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ఉచిత ఐయూసీ కాల్స్ ఆఫర్స్‌తోజియో ఆల్ ఇన్‌ వన్ ప్లాన్స్‌ సోమవారం ఓ ప్రకటన చేసింది. జియోయేతర మొబైల్‌ నంబర్లకు వెయ్యి మిషాల ఉచిత టాక్‌టైమ్‌ ఆఫర్‌ చేసింది. దీంతోపాటు ఎప్పటిలాగే జియో టు జియో అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయం కల్పించారు.

ఈ కొత్త ప్లాన్స్‌ ప్రకారం నెలకు రూ. 222, రెండు నెలలకు రూ. 333, మూడు నెలలకు రూ. 444 లు ప్లాన్లను ఎంపిక చేసుకోవచ్చు .జియో కస్టమర్లు తమ ప్లాన్స్‌ను రూ. 111తో అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని పేర్కొంది.

Next Story