గాంధీజీ కళ్లద్దాల వేలం పాట.. ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

By సుభాష్  Published on  24 Aug 2020 8:08 AM GMT
గాంధీజీ కళ్లద్దాల వేలం పాట.. ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు

మహాత్మగాంధీజీ వాడిన కళ్లద్దాలను వేలంలో పెట్టారు. వేలం పాటలో ఎంత కొన్నారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. గాంధీ వాడిన కళ్లద్దాలను బ్రిటన్‌లోని ఈస్ట్‌ బ్రిస్టల్‌ సంస్థ నిర్వహించిన వేలం పాటలో రూ.2కోట్ల 55 లక్షల 906 ఓ వ్యక్తి దక్కించుకున్నాడు.

అమెరికాలో ఇలాంటి అరుదైన వాటిని సేకరించే ఓ వ్యక్తి ఈ కళ్లద్దాలను దక్కించుకున్నారు. ఇందు కోసం 260,000 పౌండ్లు చెల్లించారు. అంత డబ్బు పెట్టి కొన్నారంటే గాంధీపై ఎంతటి అభిమానం ఉందే తెలిసిపోతుంది.

వేలాల్లో ఇదో రికార్డు: బ్రిటన్‌ సంస్థ

వేలాల్లో ఇదో రికార్డు అని బ్రిటన్‌ సంస్థ తెలిపింది. ఇన్నాళ్లు ఈ కళ్లద్దాలు కలిగివున్న వ్యక్తి ముసలాయన అయిపోయారు. ప్రస్తుతం మాంగోస్ట్స్‌ ఫీల్డ్‌లో ఉంటున్నారు. కళ్లద్దాల ద్వారా వచ్చిన డబ్బును తన కూతురికి సంగం పంచుతానన్నారు. ఈ ఫ్యామిలీకి చెందిన ఒకరు, 1920లో దక్షిణ ఆఫ్రికాలో గాంధీజీని కలిశారు. అలా గాంధీ వాడిన కళ్లద్దాలు ఈ ఫ్యామిలీకి దక్కాయి. అవి చేతులు మారుతూ, ఇప్పుడు అమ్ముడవుతున్నాయి.

50 ఏళ్లుగా ఆ కళ్లద్దాలను ఓ తెల్లటి ఎన్‌వలప్‌ కవర్‌లో ఉంచారు. వాటిని అమ్మాలనుకున్నప్పుడు, వాటి ధర రూ.14 లక్షలకుపైగా పలకవచ్చని వేలం సంస్థ చెబితే, ఆ కుటుంబం ఆశ్చర్యపోయింది. అవి ఏకంగా రెండున్నర కోట్లకుపైగా పలకడంతో ఇప్పుడు ఆ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది.

Next Story