శివకాశిలో భారీ పేలుడు.. ముగ్గురి మృతి
Published on 19 Feb 2020 4:33 PM GMT
తమిళనాడులోని శివకాశి సమీపంలో బుధవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాణా సంచా తయారీ కర్మాగారంలో పేలుడు చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.
పేలుడు ధాటికి బాణాసంచా తయారీ కూలీలు దూరంగా ఎగిరిపడ్డారు.సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటన పై కేసు నమోదు చేసుకుని కర్మాగారం యజమాని కోసం గాలిస్తున్నారు.
Next Story