కృష్ణా జిల్లాలో పేలుడు.. తండ్రీకొడుకులు మృతి
By సుభాష్ Published on 3 Sept 2020 10:46 PM ISTకృష్ణా జిల్లాలో పేలుడు జరిగింది. గన్నవరం మండలం సూరంపల్లి పారిశ్రామిక వాడలోని ఓ ఫ్లైవుడ్ కంపెనీలో ఖాళీ కెమెకల్ డబ్బాలు పేలడంతో తండ్రీ కొడుకులు మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. జయరాజ్ ఫ్లైవుడ్ కంపెనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. తుక్కు కొనుగోలు చేసేందుకు వచ్చిన తండ్రీ కొడుకులు తమ ఆటోలోకి ఖాళీ కెమికల్ డబ్బాలను ఎక్కిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది.
ఈ ప్రమాదంలో తండ్రీకొడుకుల మృతదేహాలు కొంత దూరం ఎగిరిపడ్డాయి. తండ్రీ కొడుకులు మృతి చెందడంతో అక్కడున్నవారిని తీవ్రంగా కలచివేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు విజయవాడ రూరల్లోని కండ్రిక గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు
Next Story