'భగవంత్ కేసరి', 'లియో' ఓటీటీ‌ల్లో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతాయంటే..

బాలకృష్ణ 'భగవంత్‌ కేసరి', విజయ్‌ 'లియో' సినిమాలు థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

By Srikanth Gundamalla  Published on  19 Oct 2023 3:00 PM GMT
bhagavanth kesari, leo movie, ott,

 'భగవంత్ కేసరి', 'లియో' ఓటీటీలో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతాయంటే..

దసరా కానుకగా గురువారం రెండు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. బాలకృష్ణ 'భగవంత్‌ కేసరి', విజయ్‌ 'లియో' సినిమాలు థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా మొదటి రోజే మంచి టాక్‌ను సొంతం చేసుకున్నాయి. రెండూ ఈ సినిమాలకు అవే బెస్ట్‌ అని చెబుతున్నారు. ఈ క్రమంలో భగవంత్ కేసరి, లియో సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతాయనే విషయాలు తెలిసాయి.

విజయ్‌-లోకేష్‌ కనగరాజ్‌ కాంబోలో వచ్చిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘లియో’ ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. పెద్ద హీరోల సినిమాలు నాలుగైదు వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతాయి. ఈ క్రమంలో లియో కూడా నాలుగైదు వారాల తర్వాతే నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్ అవ్వనుంది. ఇందులో త్రిషతోఓ పాటు బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.

ఇక అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన మూవీ 'భగవంత్ కేసరి'. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ కూడా నాలుగైదు వారాల తర్వాతే ఓటీటీ వేదికగా అందుబాటులోకి వస్తుంది. బాలకృష్ణకు జోడిగా కాజల్‌ అగర్వాల్ నటించారు. పెళ్లి అయిన తర్వాత తొలిసారిగా ఆమె బిగ్‌స్క్రీన్‌పై కనిపిస్తున్నారు. అలాగే ఈ మూవీలో శ్రీలీల ప్రధాన పాత్రలో కనిపించారు. ఇక రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాను కూడా ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ సొంతం చేసుకుంది. టైగర్‌ ష్రాఫ్‌ 'గణ్‌పథ్‌' రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకుంది. ఈ సినిమాలు అన్నీ థియేట్రికల్ రన్‌ పూర్తి చేసుకున్న తర్వాత ఆయా ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి.

మరోవైపు లియో సినిమాకు హీరో విజయ్‌ గురించి ఓ వార్త చర్చనీయాంశంగా మారింది. లియో సినిమాకు విజయ్‌ పారితోషికం రూ.120 కోట్లు తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. మొత్తం సినిమా బడ్జెట్ రూ.300 కోట్లు అవ్వగా దాంట్లో సగం పారితోషికం విజయ్‌కే వెళ్తున్నట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

Next Story