డా. వైయస్ రెడ్డికి నేషనల్ అవార్డ్

By అంజి  Published on  25 Jan 2020 2:43 AM GMT
డా. వైయస్ రెడ్డికి నేషనల్ అవార్డ్

కేరళ: ప‌్ర‌ముఖ దంత‌వైద్యులు డాక్టర్‌ వైఎస్‌ రెడ్డికి.. డాక్టర్‌ యు.ఎస్‌.కృష్ణ నాయక్‌ పురస్కారం లభించింది. డాక్టర్‌ వైఎస్‌ రెడ్డి ప్ర‌స్తుతం ఇండియన్‌ డెంటల్‌ అసోసియేషన్‌ దక్కన్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. శుక్ర‌వారం రాత్రి కేర‌ళ రాష్ట్రం తిరువనంతపురంలో ఇండియన్‌ డెంటల్‌ అసోసియేషన్‌-2020 సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కేరళ గవర్నర్‌ అరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ చేతుల మీదుగా డాక్టర్‌ వైఎస్‌ రెడ్డి ఈ పురస్కారం అందుకున్నారు. 2019 సంవత్సరానికి గాను ఉత్త‌మ సేవ‌లు అంధించిన వారికి.. అసోసియేషన్ లోని 650కి పైగా శాఖలలోని డాక్ట‌ర్ల‌ పనితీరు ఆధారంగా ఈ అవార్డు గ్రహీతలను ఎంపిక చేశారు.

Dr. YS Reddy

ఇదిలా ఉంటే.. ఐడిఎ (ఇండియన్ డెంటల్ అసోసియేషన్) 1946లో స్థాపించబడింది. ఈ అసోసియేషన్‌లో 75,000 మందికిపైగా డెంటల్‌ డాక్టర్లు ఉన్నారు. దేశంలో ప్రజలందరి నోటి ఆరోగ్యం కోసం ఈ సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది. IDA 29 రాష్ట్రాల‌లో 650కి పైగా బ్రాంచ్‌ల‌ ద్వారా వివిధ ప్రాజెక్టులు, కార్యక్రమాలను నిర్వహిస్తోంది. దంత సంరక్షణ, పరిశుభ్రత రంగంలో కార్పొరేట్ ఏజెన్సీలతో కలిసి, నోటి ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఈ సంస్థకు ప్రభుత్వ, కార్పొరేట్‌ దంత సంస్థలు, ఎన్జీవో సంస్థలతో సంబంధాలు ఉన్నాయి.

Dr. YS Reddy

భారతదేశాన్ని ప్రపంచంలోని నోటి ఆరోగ్య సంరక్షణ గమ్యస్థానంగా మార్చడమే లక్ష్యంగా ఈ సంస్థ ప‌నిచేస్తుంది. ఈ విష‌య‌మై ఐడీఏకు ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న‌ది. ఇందులో భాగంగా రోజువారీ క్లినికల్, పరిశోధన పనుల్లో వృత్తిపరమైన నైపుణ్యాన్ని ప్రోత్సహిస్తోంది.

Dr. YS Reddy

Next Story