హైదరాబాద్: హుజూర్ నగర్ ఎన్నికల వేళ టీ టీడీపీకి గట్టి దెబ్బే తగిలిందని చెప్పుకోవాలి. టీడీపీకి గుడ్ బై చెబుతున్నట్లు దేవెందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ లేఖ రాశారు. వీరేందర్ గౌడ్ త్వరలో బీజేపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. అయితే...టీడీపీకి ఒక సిద్ధాంతమంటూలేదని లేఖలో ఘాటుగా విమర్శించారు వీరేందర్ గౌడ్. పార్టీకి సిద్దాంతమంటూ లేకపోతే ఆత్మ లేనట్లేనని ఆయన లేఖలో అభిప్రాయపడ్డారు.