సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అరవింద్‌ కేజ్రీవాల్‌

By సుభాష్  Published on  16 Feb 2020 7:04 AM GMT
సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అరవింద్‌ కేజ్రీవాల్‌

ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ముచ్చటగా మూడో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో అట్టహాసంగా ప్రారంభమైన ఈ ప్రమాణ స్వీకారానికి ప్రముఖులు, రాజకీయ నేతలు, ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు. 70 అసెంబ్లీ సీట్లున్న అసెంబ్లీలో ఆప్‌ 62 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 8 స్థానాలకే సరిపెట్టుకుంది. ఇక కాంగ్రెస్‌ మాత్రం అడ్రస్‌ లేకుండా పోయింది. ఇక కేజ్రీవాల్‌ ప్రమాణ స్వీకారానికి భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.

'ధన్యవాద్ ఢిల్లీ' పేరుతో ఈ ప్రమాణ స్వీకారం జరుగుతోంది. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌తో ఢిల్లీ లెప్ట్‌నెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. కేజ్రీవాల్‌తో పాటు మంత్రులుగా మనీష్‌ సిసోడియా, సత్యేంద్ర జైన్‌, గోపాల్‌ రాయ్‌లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మూడువేల మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Next Story