'కల్కి' కోటలో కోటాను కోట్లు...!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Oct 2019 4:31 PM GMT
కల్కి కోటలో కోటాను కోట్లు...!

చెన్నై: తమిళనాడులోని 'కల్కి' ఆశ్రమంలో తనిఖీలు కొలిక్కి వచ్చినట్లు ఐటీ అధికారులు చెప్పారు. తమ సోదాలకు సంబంధించి ప్రెస్ నోట్ రిలీజ్‌ చేశారు. తమిళనాడు తో పాటు చిత్తూరు జిల్లా వరదయ్య పాళెం మండలం బత్తలవలం గ్రామ సమీపంలో ఉన్న కల్కి భగవాన్ ఆశ్రమంలో కూడా ఐటి అధికారులు సోదాలు చేశారు. ఇక్కడ కూడా కోట్ల రూపాయలు డబ్బు, గోల్డ్ బిస్కెట్ లు స్వాధీనం చేసుకున్నట్లు ఐటీ అధికారులు చెప్పారు.

  • రూ.5 కోట్లు విలువచేసే వజ్రాలు
  • రూ.26 కోట్లు విలువ చేసే 88 కేజీల బంగారం
  • రూ.40.39 కోట్ల నగదుతో పాటు $18 కోట్ల విదేశీ కరెన్సీ
  • రూ. 93 కోట్ల విలువ చేసే బంగారు, నగదు స్వాధీనం
  • రూ.409 కోట్లకు రసీదులు అడిగిన అధికారులు

వారు 'కృత్రిమ దేవుళ్ళు

ప్రచారానికి ఓ ఛానల్ కావాలనుకున్నారు. స్టూడియో ఎన్ కొనుగోలు చేశారు. కల్కి దంపతులు మూడో రోజు కూడా అజ్ఞానం నుంచి బయటకు రాలేదు. రూ.409 కోట్లకు రశీదులు లేవు. మొత్తం రూ.93 కోట్ల బంగారం, నగదు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భూ దందాలకు సంబంధించిన రూ. 1182 డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. చాలా వరకు బినామీలు ఉండటం గమనార్హం. విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలు వెలుగులోకి రావాలంటే కల్కీ వేలుముద్రలు , పాస్ వర్డ్ గా ఉండటంతో అధికారులు సంబంధిత హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు.

కలానికి కల్కి పోటు

హైదరాబాద్, మణికొండలోని పంచవటి కాలనీలో స్టూడియో ఎన్ ఛానల్ ఉంది. ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు పిల్లనిచ్చిన మామ నార్నే శ్రీనివాస రావు దగ్గర నుంచి 2014లో ‘ ఏకం కల్కి ఆధ్యాత్మిక ‘ కేంద్రం వారు ఈ ఛానల్ కొనుగోలు చేశారు. దేశ వ్యాప్తంగా ‘ ఏకం కల్కి ఆధ్యాత్మిక ‘ కేంద్రాలు, ఆఫీసులలో జరుగుతున్న ఐటీ సోదాల్లో భాగంగా స్టూడియో ఎన్ లో కూడా సోదాలు జరిగాయి. అంతే జర్నలిస్టులకు జీతాలు ఇవ్వకుండా మెడబట్టి గెంటేశారు. అయితే ..ఆ పాత్రికేయులకు కోట్లలో జీతాలు ఇచ్చినట్లు లెక్కల్లో పక్కాగా చూపారు. ఐటీ దాడుల సందర్భంగా ఈ విషయం వెలుగుచూసింది. ప్రస్తుతం ఈ ఛానల్ మూతపడింది. అయితే ఇక్కడ నొక్కిన సొత్తు ఓ మహిళా సీఈవో బాగా వెనకేసుకున్నట్లు ఐటీ అధికారులు తమ సోదాల్లో కనుగొన్నారు.

అజ్ఞాతంలో 'కల్కి'దంపతులు

కల్కి భగవాన్‌ ఆశ్రమంలో మూడో రోజు ఐటీ సోదాలు పూర్తయ్యాయి. కల్కి ఆశ్రమం వ్యవస్థాపకులు కల్కి భగవాన్ అలియాస్ విజయ్‌ కుమార్‌, పద్మావతిలు దాడులజరుగున్నప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అధికారులు చేపట్టిన తనిఖీల్లో క్యాంపస్‌-3లో భారీగా విదేశీ నగదు, బంగారాన్ని గుర్తించారు. ఈ మేరకు కల్కి భగవాన్‌ కుమారుడు కృష్ణ నాయుడు, కోడలు ప్రీతినాయుడు, ట్రస్ట్‌ నిర్వహకుడు లోకేష్‌ దాసాజీని అధికారులు అదుపులోకి తీసుకొని విచారించారు. స్వదేశీ, విదేశీ భక్తుల ద్వారా భారీ ఎత్తున విరాళాలు సేకరించి.. వందల ఎకరాలు, కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కొనుగోలు చేసినట్లు ఐటీ అధికారులు నిర్ధారించారు. ఈ దాడుల అనంతరం అధికారులు తాము స్వాధీనం చేసుకున్న వివరాలను వెల్లడించారు.

Next Story