AP : ఉన్మాది ఘాతుకం.. ప్రేమను నిరాకరించిందని నోట్లో పురుగుల మందు పోసి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఓ ఉన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమను నిరాకరించిందని ఓ అమ్మాయితో పురుగుల మందును తాగించాడు ఆ ఉన్మాది.

By Kalasani Durgapraveen  Published on  19 Oct 2024 4:40 AM GMT
AP : ఉన్మాది ఘాతుకం.. ప్రేమను నిరాకరించిందని నోట్లో పురుగుల మందు పోసి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఓ ఉన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమను నిరాకరించిందని ఓ అమ్మాయితో పురుగుల మందును తాగించాడు ఆ ఉన్మాది. ఇంటర్‌ చదువుతున్న ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడంటూ ఓ వ్యక్తి వెంటపడ్డాడు. అందుకు ఆ అమ్మాయి ఒప్పుకోకపోవడంతో హత్య చేయాలని నిర్ణయించుకుని, దారుణానికి ఒడిగట్టాడు. కర్నూలు జిల్లాలోని ఆస్పరి మండలం నగరూరులో ఈ ఘటన చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన నరసమ్మ, చిన్న వీరేష్‌ దంపతుల ఏకైక కుమార్తె అశ్విని పత్తికొండ మోడల్‌ స్కూల్‌లో ఇంటర్మీడియెట్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. సన్నీ అనే యువకుడు గత కొంతకాలంగా అశ్వినిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఆమె అతడి ప్రేమను నిరాకరిస్తూ వస్తోంది. ఆమె మీద పగ పెంచుకున్న సన్నీ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి అశ్విని ఇంట్లోకి చొరబడ్డాడు. ఆమె నోట్లో పురుగుల మందు పోసి హత్య చేశాడు. విషయం తెలిసిన వెంటనే అశ్విని తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


Next Story