కాటేదాన్‌లో దారుణం... మహిళను బండరాయితో కొట్టి హత్య

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పరిధిలోని కాటేదాన్‌లో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది.

By Srikanth Gundamalla  Published on  29 March 2024 4:28 AM GMT
woman, murder,  katedan,  police,

 కాటేదాన్‌లో దారుణం... మహిళను బండరాయితో కొట్టి హత్య 

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పరిధిలోని కాటేదాన్‌లో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళను బండరాయితో తలపై కొట్టి కిరాతకంగా హత్య చేశౄరు. కాటేదాన్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ దగ్గర మహిళ మృతదేహాన్ని శుక్రవారం ఉదయం గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాటేదాన్‌ పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం మహిళ మృతదేహం కలకలం రేపింది. స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ దగ్గర మహిళ తలపై బండరాయితో కొట్టి చంపేశారు. ఆమె ముఖం గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక మృతదేహం లభ్యంకావడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. బండరాయితో కొట్టడం వల్లే ఆమె చనిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అక్కడ లభించిన ఆధారాల మేరకు మృతురాలు సమీరా ఖాన్‌గా గుర్తించారు. అయితే.. ప్రియుడే సమీరాను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక విచారణలో చెబుతున్నారు. మహిళ మృతదేహాన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఇక ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. మహిళ హత్య ఘటనపై కేసు నమోదు చేశామనీ.. దర్యాప్తు అనంతరం అన్ని విషయాలు చెబుతామని రాజేంద్రనగ్ పోలీసులు వెల్లడించారు.

Next Story