ఏలూరు: ముగ్గు వేస్తున్న అక్కాచెల్లెళ్లపైకి దూసుకెళ్లిన లారీ

పండగ వేళ ఏలూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on  14 Jan 2024 8:05 AM GMT
lorry, rammed,   two sisters, eluru,

ఏలూరు: ముగ్గు వేస్తున్న అక్కాచెల్లెళ్లపైకి దూసుకెళ్లిన లారీ

పండగ వేళ ఏలూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి ముందు ముగ్గు వేస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లపైకి లారీ దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు గాయాలపాలైన యువతిని ఆస్పత్రికి తరలించారు.

మండవల్లి మండలం కానుకొల్లులో ఈ సంఘటన చోటుచేసుకుంది. నాగబాబు అనే వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు ఉన్నాయి. తేజస్విని (16), పల్లవి దుర్గ (18) ఇద్దరు అక్కాచెల్లెళ్లు. ముదినేపల్లిలోని ఓ కాలేజ్‌లో ఇంటర్‌ చదువుతున్నారు. అయితే.. ఆదివారం భోగి పండగ సందర్భంగా ఇంటి ముందు వేయాలనుకున్నారు. ఈ క్రమంలోనే ఇంటి ముందు రోడ్డుపై ఉదయం ముగ్గు వేయడం ప్రారంభించారు. ఆ సమయంలోనే గుడివాడ నుంచి కైకలూరు వైపు వెళ్తున్న లారీ ఇద్దరు అక్కాచెల్లెళ్లపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తేజస్విని ప్రాణాలు కోల్పోయింది. ఆమె అక్క దుర్గకు తీవ్రగాయాలు అయ్యాయి.

గాయాలపాలైన యువతిని కుటుంబ సభ్యులు వెంటనే ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. లారీ డ్రైవర్‌ ప్రకాశ్‌ రావుగా పోలీసలు గుర్తించారు. పోలీసులకు చెప్పడంతో నిందితుడని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ గ్రామస్తులు, యువతి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.

Next Story