NTR అభిమాని సెల్ఫీ సూసైడ్ వీడియో..నెట్టింట వైరల్

శ్యామ్‌ సెల్ఫీ సూసైడ్‌కు సంబంధించి వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ అవుతోంది.

By Srikanth Gundamalla  Published on  27 Jun 2023 9:43 AM GMT
NTR Fan, Selfie, Suicide, Video

NTR అభిమాని సెల్ఫీ సూసైడ్ వీడియో..నెట్టింట వైరల్   

ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ అనుమానాస్ప‌ద రీతిలో మృత్యువాత ప‌డ‌టం సినీ, రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. చంద్రబాబు, నారా లోకేశ్‌ దీనిపై స్పందించారు కూడా. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిపి.. దోషులను పట్టుకోవాలని కోరారు. ఈ క్రమంలో శ్యామ్‌ సెల్ఫీ సూసైడ్‌కు సంబంధించి వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వీడియోలో శ్యామ్‌ మాట్లాడుతూ.. "మమ్మీ ఐయామ్ సారీ.. డాడీ సారీ.. నేను ఉన్నా లేకపోయినా హ్యాపీగా ఉండండి. నన్ను ఇన్ని రోజులు పెంచినందుకు థాంక్యూ మమ్మీ, డ్యాడీ. నేను అందరి దృష్టిలో వేస్ట్‌.. నేను ఉన్నా దాంట్లో లాభం లేదు.. సరేనా మమ్మీ, డాడీ. మళ్లీ జన్మంటూ ఉంటే మళ్లీ మీకే పుట్టాలి. ఇంకో విషయం చెప్పాలి. నాకు జాబ్‌ చేయాలనే ఇంట్రెస్ట్‌ అస్సలు లేదు.. నా వల్ల కూడా కాదు జాబ్‌ చేయడం.. మిస్‌యూ డాడీ.. మిస్‌యూ మమ్మీ". అంటూ సెల్ఫీ సూసైడ్‌ వీడియో తీసుకున్నాడు శ్యామ్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

దీనికి ముందే అభిమాని మ‌ర‌ణంపై ఎన్టీఆర్ స్పందించారు. అభిమాని మృతికి సంతాపం వ్య‌క్తం చేశాడు ఎన్టీఆర్‌. శ్యామ్‌ మ‌రణంపై త‌క్ష‌ణ‌మే ద‌ర్యాప్తు జ‌ర‌పాల‌ని ప్ర‌భుత్వ అధికారుల‌కు ఎన్టీఆర్ విజ్ఞ‌ప్తి చేశాడు. ఈ మేర‌కు ఓ లేఖ‌ను రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ తన లేఖలో.. "శ్యామ్ మ‌ర‌ణం అత్యంత బాధాక‌ర‌ణ‌మైన సంఘ‌ట‌న‌. శ్యామ్ కుటుంబానికి నా ప్ర‌గాఢ‌మైన సానుభూతిని తెలియ‌జేస్తున్నాను. ఎటువంటి ప‌రిస్థితుల్లో ఎలా చ‌నిపోయి ఉంటాడో తెలియ‌క‌పోవ‌డం నా మ‌న‌సును క‌లిచివేస్తుంది" అని ఎన్టీఆర్ ఈ లెట‌ర్‌లో పేర్కొన్నారు.

తాజాగా శ్యామ్‌ మరణానికి సంబంధించి సెల్ఫీ సూసైడ్‌ వీడియో వచ్చినా.. ఇంకొన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరకలేదు. సూసైడ్‌ చేసుకునే వ్యక్తి ఒంటిపై ఎందుకు గాయాలు ఉన్నాయి..? శరీరం నేలను తాకి ఉందని..వీటికి సమాధానాలు చెప్పాలని శ్యామ్‌ తల్లిదండ్రులు, స్నేహితులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు.. ఇప్పుడు తాజాగా వైరల్‌ అవుతోన్న శ్యామ్‌ సెల్ఫీ సూసైడ్‌ వీడియోలో కూడా ఎవరో మట్లాడుతున్నారని.. వీడియో కూడా ఎందుకు పార్ట్స్‌గా ఉందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో దర్యాప్తు నిష్పక్షపాతంగా జరపాలని.. శ్యామ్‌కు న్యాయం చేయాలని అందరూ కోరుకుంటున్నారు.

Next Story