నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది సార్.. ఫుడ్ ఇవ్వలేము అని చెప్పిన హోటల్ యజమాని

Shopkeeper refused to give food due to night curfew.కొత్త సంవత్సరం తొలిరోజునే నోయిడాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి

By M.S.R  Published on  1 Jan 2022 3:47 PM GMT
నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది సార్.. ఫుడ్ ఇవ్వలేము అని చెప్పిన హోటల్ యజమాని

కొత్త సంవత్సరం తొలిరోజునే నోయిడాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. రాత్రి కర్ఫ్యూ సమయంలో ఓ షాప్ యజమాని ఆహారం ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో అతడిని కాల్చి చంపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం.

గ్రేటర్ నోయిడాలోని బీటా-2 ప్రాంతంలోని ఓమాక్స్ ఆర్కాడియా మాల్‌లోని ఆన్‌లైన్ ఫుడ్ జాయింట్‌లో రాత్రి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి ఆన్‌లైన్ ఫుడ్ జాయింట్ యజమాని రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతడిని ఎవరో కాల్చారు. గాయపడిన దుకాణ యజమానిని ఆసుపత్రికి తరలించగా, అతను ప్రాణాలు కోల్పోయాడు. జనవరి 1న, ఈ ఆన్‌లైన్ ఫుడ్ జాయింట్‌కు గత 3 సంవత్సరాలుగా కస్టమర్‌లుగా ఉన్న 2 వ్యక్తులు తినడానికి వచ్చారు, కానీ దుకాణం మూసివేయబడింది.

షాప్ యజమాని ఆహారం ఇవ్వడానికి నిరాకరించాడు. ఆహారం లేకపోవడంతో ఇద్దరు కస్టమర్లు షాపు యజమానితో అక్కడికక్కడే వాగ్వాదం జరిగింది. తరువాత విషయం సద్దుమణిగింది. ఆ తర్వాత కస్టమర్లిద్దరూ తిరిగి వచ్చారు. దుకాణం తలుపులు తెరిచి దుకాణ యజమానిని తుపాకీతో కాల్చారు. ఈ క్రమంలో షాపు యజమాని ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. గౌతమ్ బుద్ధ నగర్‌లో రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంది. ఆ మధ్య సమయంలో ఫుడ్ ఇవ్వమని యజమాని చెప్పడంతోనే ఈ దారుణానికి నిందితులు పాల్పడ్డారు.

Next Story