ఫేక్ బాంబులు పెడుతూ జనాల్లో టెన్షన్.. ఎందుకు అలా చేస్తున్నారంటే
Panic Spread By Planting Fake Bombs 13 Times In 6 Years.గత కొన్ని రోజులుగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా ప్రాంతంలో
By M.S.R Published on 4 Feb 2022 4:45 PM IST
గత కొన్ని రోజులుగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా ప్రాంతంలో డమ్మీ బాంబులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ ఘటనలపై పోలీసులకు సమాచారం అందడంతో ఆ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. అరెస్టయిన నేరస్థులలో ఒక ఇంజనీర్ తన ఉద్యోగాన్ని కోల్పోయిన తర్వాత ప్రజల్లో భయాందోళనలను వ్యాప్తి చేయడం ప్రారంభించాడు. ఆరేళ్లలో పలు ప్రాంతాల్లో 13 సార్లు డమ్మీ బాంబులు పెట్టి భయాందోళనలు సృష్టించాడని ఎస్పీ నవనీత్ భాసిన్ తెలిపారు. అతను ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో అనేక డమ్మీ బాంబులను అమర్చడం ద్వారా ప్రజల్లో భయాన్ని పంచాడు.
రేవా జిల్లాలో గత కొన్ని రోజులుగా జాతీయ రహదారిపై డమ్మీ బాంబులు పెట్టి భయాందోళనకు గురిచేస్తున్నారు. ఆ తర్వాత హైవే, టోల్ ప్లాజాలలో అమర్చిన సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించామని ఎస్పీ తెలిపారు. నిందితులు తమ నేరాలను అంగీకరించారు. ఈ ముఠాకు ప్రధాన నిందితుడు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు చెందిన మెకానికల్ ఇంజనీర్ అని, అతను ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడని ఎస్పీ నవనీత్ భాసిన్ చెప్పారు. అతనికి ఉన్న ఎపిలెప్టిక్ మూర్ఛల కారణంగా 2015లో ఉద్యోగం కోల్పోయాడు. మరో నిందితుడు ఎల్ఎల్బి చేసిన మీరట్ నివాసి. మూడో నిందితుడు కూడా మీరట్ నివాసి. నేరస్తుల వద్ద నుంచి డమ్మీ బాంబుల తయారీకి సంబంధించిన సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుంచి ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు, మదర్బోర్డులు, పెయింట్లు, టేపులు, అల్యూమినియం వైర్లు, ఎలక్ట్రానిక్ వాచీలు స్వాధీనం చేసుకున్నారు.