పర్సనల్ ఫోటోలను అతడికి పంపడమే ఆ యువతి చేసిన తప్పు

Man held for posting pvt pics of delhi girl on social media.సోషల్ మీడియాలో ఓ అమ్మాయి ప్రైవేట్ ఫోటోలు పోస్ట్ చేసి బ్లాక్

By M.S.R  Published on  1 Jan 2022 3:53 PM GMT
పర్సనల్ ఫోటోలను అతడికి పంపడమే ఆ యువతి చేసిన తప్పు

సోషల్ మీడియాలో ఓ అమ్మాయి ప్రైవేట్ ఫోటోలు పోస్ట్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు శనివారం తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌కు చెందిన రాజేష్ సింగ్ సుమన్ అనే నిందితుడిని సెక్షన్‌లు 354డి (వెంబడించడం), 384 (దోపిడీ), 506 (నేరపూరిత బెదిరింపు) మరియు 509 సెక్షన్‌ల కింద అరెస్టు చేశారు.

ద్వారకా సౌత్ పోలీస్ స్టేషన్‌లో ఒక ఫిర్యాదు అందింది, దీనిలో ఒక యువతి నిందితుడు రాజేష్‌పై తనను వెంబడించడం, బ్లాక్ మెయిల్ చేయడం మరియు బెదిరించడం వంటి ఆరోపణలపై ఫిర్యాదు చేసింది. తనకు మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా నిందితుడితో పరిచయం ఏర్పడిందని, అతడిని రెండు సార్లు కలిశానని ఆమె ఆరోపించింది. తన వ్యక్తిగత ఫొటోలను నిందితుడితో పంచుకున్నట్లు బాధితురాలు తెలిపారు. అయితే ఆ తర్వాత వివాహం వద్దనుకున్నారు. ఆ తర్వాత నిందితుడు తన ప్రైవేట్ ఫోటోలను సోషల్ ప్లాట్‌ఫారమ్‌లలో పోస్ట్ చేస్తున్నానని బెదిరించడమే కాకుండా, బ్లాక్‌మెయిల్ చేయడం బెదిరించడం ప్రారంభించాడు. నిందితుడు ఆమె పేరు మీద నకిలీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను తయారు చేసి, అందులో తన చిత్రాలను పోస్ట్ చేశాడని ఆమె ఆరోపించింది.

ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నిందితుడిని అలీగఢ్‌లో అరెస్టు చేశారు. విచారణలో, నిందితుడు మరింత మంది మహిళలతో ఇటువంటి నేరాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. అతని మొబైల్ ఫోన్ డేటా ను పరిశీలిస్తున్నారు. తదుపరి విచారణ ఇంకా కొనసాగుతోంది అని అధికారి తెలిపారు.

Next Story