మంత్రి కేటీఆర్‌ పేరు చెప్పి మోసాలకు పాల్పడిన మాజీ క్రికెటర్‌ అరెస్ట్‌

Former cricketer arrested ..తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పేరు చెప్పి మోసాలకు పాల్పడుతున్న ఆంధ్రా

By సుభాష్  Published on  17 Nov 2020 6:02 AM GMT
మంత్రి కేటీఆర్‌ పేరు చెప్పి మోసాలకు పాల్పడిన మాజీ క్రికెటర్‌ అరెస్ట్‌

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పేరు చెప్పి మోసాలకు పాల్పడుతున్న ఆంధ్రా రంజీ జట్టు మాజీ క్రికెటర్‌ నాగరాజును తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. తాను మంత్రి కేటీఆర్‌కు పీఏనంటూ చెప్పుకుంటున్న నాగరాజు మోసాలు చేస్తుండటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతనిపై గతంలోనూ ఇదే తరహాలో కేసులు నమోదయ్యాయి. బీసీసీఐ సెలెక్షన్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ పేరు వాడుకుని మోసాలు చేసిన ఘటనలో నాగరరాజును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇలాంటి కేసులు నాగరాజుపై ఎన్నో కేసులున్నట్లు తెలుస్తోంది.

నాగరాజు పూర్తి పేరు బుడమూరి నాగరాజు, వయసు 24 ఏళ్లు. నాగరాజు క్రికెటర్లు టీమిండియాలో స్థానం కోసం కృషి చేస్తుంటారు. కానీ దారితప్పిన నాగరాజు జల్సాలకు, మోసాలకు అలవాటు పడ్డాడు. నాగరాజుది శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం యవ్వారిపేట. ఎంబీయే వరకు చదువుకున్నాడు. నాగరాజుకు చిన్ననాటి నుంచే క్రికెట్ పట్ల ఎంతో ప్రతిభ చూపేవాడు.2006లో అండర్‌ -14 జట్టుకు ఎంపికై సత్తా చాటాడు.

2014లో ఆంధ్రా రంజీ జట్టుకు ఎంపికై పలు మ్యాచ్‌లు ఆడాడు. అంతేకాదు.. 2016లో ఏకధాటిగా 82 గంటల పాటు బ్యాటింగ్‌ చేసి గిన్నిస్‌బుక్‌ లో స్థానం సంపాదించుకున్నాడు. నాగరాజు ప్రతిభ పట్ల అనేక ఎన్జీవోలు ఆర్థిక సాయం చేసి ప్రోత్సహించేందుకకు ముందుకొచ్చాయి. ఆ విధంగా చేతినిండా డబ్బు రావడంతో నాగరాజు జల్సాలకు, మోసాలకు అలవాటు పడ్డాడు. ధోనీ క్రికెట్‌ అకాడమి పేరుతో ఓ శిక్షన కేంద్రం స్థాపించినట్లు చెప్పి పలువురికి కుచ్చు టోపీ పెట్టాడు. అలాగే తాను బీసీసీఐ సెలెక్షన్‌ కమిటీ మాజీ చైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌అని చెప్పి ఓ వ్యక్తి నుంచి రరూ.2.88 లక్షలు వసూలు చేసినట్లు తేలింది. ఓ సొసైటీ నుంచి రూ.3.88 లక్షలు తీసుకున్నాడని, ఇలాంటివే ఎన్నో కేసులున్నట్లు తెలుస్తోంది.

Next Story