అక్కడి దాకా వైరస్ వ్యాపించిందా..?

By సుభాష్  Published on  12 April 2020 8:48 AM GMT
అక్కడి దాకా వైరస్ వ్యాపించిందా..?

కరోనా వైరస్ మహమ్మారిని అదుపు చేయలేకపోతున్నారు. ప్రపంచం లోని నలుమూలలా పాకిపోయింది ఈ వైరస్. బ్రెజిల్ దేశంలోని మారు మూల ప్రాంతంలో కూడా కోవిద్-19 వైరస్ వ్యాపించడం అధికారులను తెగ టెన్షన్ పెడుతోంది.

యనోమామి తెగకు చెందిన పిల్లాడు చనిపోయాడని బ్రెజిల్ అధికారులు శుక్రవారం నాడు వెల్లడించారు. అమెజాన్ అడవుల్లో నివసించే ఈ జాతి ప్రజలకు బయట ప్రపంచంతో సంబంధాలు అతి తక్కువ. అయినా కూడా అక్కడి పిల్లాడు చనిపోయాడంటే వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతోందో అర్థం చేసుకోవాలి.

యనోమామి తెగకు చెందిన 15 సంవత్సరాల పిల్లాడికి మొట్టమొదటి సారిగా ఈ వైరస్ సోకింది. అతన్ని రొరైమా రాష్ట్ర రాజధాని అయిన బోవా విస్తాలోని ఆసుపత్రిలోని ఐసీయు వార్డుకు వారం కిందట తరలించారు. కానీ ఆ పిల్లాడు కోలుకోలేకపోయాడని.. చనిపోయాడని వైద్యులు తెలిపారు. గురువారం రాత్రి అతడికి తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు రావడంతో చనిపోయాడని బ్రెజిలియన్ హెల్త్ మినిస్ట్రీ తెలిపింది. ఏప్రిల్ 3వ తేదీ నుండి ఆ పిల్లాడు.. ఐసీయు లోనే ఉన్నాడని తెలుస్తోంది.

ఇతర వ్యక్తులతో ఆ పిల్లాడు కలిశాడని అందుకే అతడికి కరోనా వైరస్ సోకిందని యనోమామి హక్కుల సంఘం తెలిపింది. ఆ వ్యక్తుల్లో వైరస్ లక్షణాలు ఉన్నా కూడా వాళ్ళ దగ్గరకి ఈ పిల్లాడు వెళ్లాడని చెబుతున్నారు. హుతుకారా అసోసియేషన్ మాత్రం.. సరైన మెడికల్ హెల్త్ కేర్ తీసుకోకపోవడం వలనే మరణించాడని అన్నారు. రెండు వారల కిందటే ఆ పిల్లాడు వైద్యులను సంప్రదించాడని.. కానీ వైద్యులే సరిగా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.

Next Story