ఏపీని వెంటాడుతున్న కరోనా.. హెల్త్‌ బులిటెన్‌ విడుదల

By సుభాష్  Published on  2 May 2020 7:24 AM GMT
ఏపీని వెంటాడుతున్న కరోనా.. హెల్త్‌ బులిటెన్‌ విడుదల

ఏపీలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. తాజాగా శనివారం ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 5943 మంది నుంచి శాంపిళ్లు సేకరించగా, 62 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో మొత్తం 1525 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 441 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక రాష్ట్రంలో మరణాల సంఖ్య 33 కి చేరగా, గడిచిన 24 గంటల్లో ఎలాంటి మరణాలు సంభవించలేదని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం 1051 మందికి కరోనాతో చికిత్స పొందుతున్నారు.

Untitled 15 Copy

Next Story