మహిళా సీఐకి కరోనా.. స్టేషన్‌ మూసివేత

By సుభాష్  Published on  26 April 2020 10:54 AM GMT
మహిళా సీఐకి కరోనా.. స్టేషన్‌ మూసివేత

ఓ పోలీస్‌స్టేషన్‌లో మహిళా సీఐకి కరోనా వైరస్‌ నిర్ధారణ కావడంతో ఏకంగా స్టేషనే మూసివేశారు. తమిళనాడు-చిత్తూరు జిల్లా కుప్పం సరిహద్దు ప్రాంతంలోని సుమారు30 కిలోమీటర్ల దూరంలో ఉన్న వానియంబడి తాలుకా పోలీస్ స్టేషన్‌లో మహిళా సీఐకి కరోనా పాజిటివ్‌ తేలింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు పోలీస్‌ స్టేషన్‌ను సైతం మూసివేశారు. సీఐతో పాటు ఒకరిద్దరికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో మహిళా సీఐని చికిత్స నిమిత్తం వేలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

స్టేషన్‌ను మూసివేసిన అధికారులు..37 మంది సిబ్బందిని, వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు.

Next Story