యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ కంపెనీలో ప్రమాదం జరిగింది. కెమికల్ మిక్స్ చేస్తుండగా మంటలు చెలరేగాయి. ఓ కార్మికుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రుడిని హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడు యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరుకు చెందిన జైపాల్ గా గుర్తించారు.