చంద్రబాబుకు ఏపీ పోలీసు సంఘం వార్నింగ్
By Newsmeter.Network Published on 12 Jan 2020 12:53 PM GMTఅమరావతి : రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్పై తప్పుడు విమర్శలు చేసిన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలని ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం డిమాండ్ చేసింది. బాబుకు రాష్ట్ర ప్రజలు ఎప్పుడో బుద్ది చెప్పారని, ఇలాంటి వ్యాఖ్యలు మరలా చేస్తే తాము కూడా వెలివేస్తామని పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు, గౌరవాధ్యక్షుడు నర్రెడ్డి చంద్రశేఖర్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో నీతి నిజాయితీగా పనిచేసి పోలీస్ శాఖకు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ మంచి పేరు తీసుకొచ్చారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ పోలీస్ కమిషనర్గా ఉన్న సవాంగ్ను మంచి అధికారిగా అని పొగిడిన బాబు అధికారం చేజారడంతో విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు.. 34 ఏళ్లుగా రాష్ట్రానికి సేవలందిస్తున్న మచ్చలేని ఉన్నతాధికారిపై విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. సూర్యుడిపై ఉమ్మి వేస్తే.. అది నీ మొహం మీదే పడుతుంది చూస్కో. ఒక అధికారిని ప్రాంతం వారీగా చూస్తున్నావు. దక్షిణ భారత, ఉత్తర భారత, ఈశాన్య భారత అనే భేదభావాలు సృష్టిస్తున్నావు. ఇటువంటి చర్యలకు పాల్పడుతున్న నిన్ను దేశద్రోహి అని ఎందుకు అనకూడదు? పోలీస్ శాఖలో ఎన్నడూ లేని విధంగా కులాల వారీగా విభజన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న నువ్వు సంఘద్రోహివి. పోలీసులను బానిసలుగా వాడుకున్నావు. పోలీసుల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. సాక్షాత్తు గౌరవ రాష్ట్రపతి నుంచి ఉత్తమ అధికారిగా మా డీజీపీ కితాబు అందుకున్నారు. ఆయన గురించి మాట్లాడే కనీస అర్హత లేదు. నిన్న మీ పార్టీ సినిమా హీరోయిన్ దివ్యవాణి మంతి భ్రమించి మాట్లాడారు. ఆమె మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’అని ప్రకటనలో పేర్కొన్నారు.