హైదరాబాద్ : సీఎం వైఎస్ జగన్ కోర్ట్ మినహాయింపు పిటిషన్ను సీబీఐ కోర్ట్ కొట్టేసింది. సీబీఐ వాదనలతో ఏకీభవించింది. ఎంపీ గా ఉన్న సమయం లోనే సాక్ష్యులు ను ప్రభావితం చేశారని కోర్ట్లో సీబీఐ వాదనలు వినిపించింది. ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి హోదాలో సాక్షులను ప్రభావితం చేస్తారన్న సీబీఐ వాదనతో కోర్ట్ ఏకీభవించి..వ్యక్తిగత మినహాయింపు హాజరు పిటిషన్ను కొట్టేసింది. అయితే..సీబీఐ కోర్ట్ తీర్పు పై వైఎస్ జగన్ హైకోర్ట్ ను ఆశ్రయించారు.