అశ్వత్థామరెడ్డిపై కేసు నమోదు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Nov 2019 11:21 AM GMT
అశ్వత్థామరెడ్డిపై కేసు నమోదు

హైదరాబాద్‌: ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి, కో కన్వీనర్‌ రాజిరెడ్డిలపై అంబర్‌ పేట పోలీస్‌స్టేషన్‌ కేసు నమోదు అయ్యింది. అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డిలపై మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు దీపక్‌ కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 23 మంది ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డిలే కారణమని.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు దీపక్ కుమార్‌ తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం వాయిదా వేసుకోవడం వల్ల ఆర్టీసీ జేఏసీ పూర్తిగా ప్రభుత్వానికి అనుకూలంగా పని చేస్తోందని దీపక్‌ కుమార్‌ ఆరోపించారు.

Next Story