కర్మన్‌ఘాట్‌ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

By Newsmeter.Network  Published on  23 Feb 2020 5:38 AM GMT
కర్మన్‌ఘాట్‌ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

కర్మన్‌ఘాట్‌ చౌరస్తా సమీపంలో అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఐ20 కారు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. మరొకరి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గుర్రంగూడలో శుభకార్యానికి వెళ్లి వస్తుండగా.. ఈ ఘటన జరిగింది.

Next Story