బస్సును సురక్షితంగా పొలంలో నిలిపి డ్రైవర్ మృతి..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Sep 2019 10:17 AM GMT
బస్సును సురక్షితంగా పొలంలో నిలిపి డ్రైవర్ మృతి..!

హైదరాబాద్: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌కు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. బస్సు నిండా ప్రయాణికులు ఉండటంతో బస్సును సురక్షితంగా పొలాల్లోకి తీసుకెళ్లి నిలిపాడు . ఆ తరువాత డ్రైవర్ కూర్చొన్న సీట్లోనే ప్రాణాలు వదిలారు. ధనజోడు నుంచి భువనేశ్వర్ వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అక్కవరం చేరుకునే సరికి ఈ ఘటన జరిగింది. డ్రైవర్‌కు గుండె పోటు రావడంతో చాకచక్యంగా వ్యవహరించి..బస్సును పొలాల్లోకి దింపి... మృతి చెందాడు. ప్రయాణకులు సురక్షితంగా ఉన్నారు.

Next Story