బడ్జెట్ 2020 ముఖ్యాంశాలు

By సుభాష్  Published on  1 Feb 2020 6:33 AM GMT
బడ్జెట్ 2020 ముఖ్యాంశాలు

పార్లమెంట్ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆర్థిక శాఖమంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్నారు. ఈ బడ్జెట్‌లో రైతులకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.

బడ్జెట్‌ ముఖ్యాంశాలు

►గ్రామీణ ప్రాంతాల్లో గోదాముల నిర్మాణానికి నాబార్డు రుణాలు

► కిసాన్‌ క్రిడిట్‌ పేరుతో రైతులకు మరిన్ని రుణాలు

► మత్స్య కారులకు సాగర్‌ మిత్ర పథకం

► గోదాముల నిర్వహణ స్వయం సహాయక గ్రూపులకు అప్పగిస్తాం

► వ్యవసాయ రంగానికి రూప.2.83 లక్షల కోట్లు కేటాయింపు

► గ్రామీణ అభివృద్దికి రూ.1.23 లక్షల కోట్లు కేటాయింపు

► ఆయుష్మాన్‌భవతో దేశ వ్యాప్తంగా 20వేల ఆస్పత్రుల ఏర్పాటు

► 2025 నాటికి పాల ఉత్పత్తిని రెట్టింపు చేయాలనే లక్ష్యం

► కౌలు భూములకు కొత్త చట్టం

► రైతులు సంప్రదాయ ఎరువులకు పెద్దపీట వేయాలి

►సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం

► వ్యవసాయ ఉత్పత్తుల నిల్వలకు కొత్త గోదాములు

► పీపీపీ భాగస్వామ్యంతో కిసాన్‌ రైతు ఏర్పాటు

► రైతుల కోసం ఉడాన్‌ పథకం

► నాబార్డు పథకాన్ని పొడిగిస్తాం

► సేంద్రీయ ఉత్పత్తుల విక్రయానికి ఆన్‌లైన్‌ పోర్టల్‌

► జల్‌జీవన్‌ మిషన్‌కు రూ.3.06 లక్షల కోట్లు

► స్వచ్ఛభారత్‌కు రూ.12.300 కోట్లు

► త్వరలో కొత్త విద్యా విధానం

► ఉన్నత విద్యలో విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహం

Next Story