ట్రూజెట్ విమానానికి తప్పిన ప్రమాదం
By Newsmeter.NetworkPublished on : 16 Jan 2020 12:36 PM

ట్రూజెట్ విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కడప నుంచి విజయవాడకు వెళుతున్న ట్రూజెట్ విమానానం టేకాఫ్ అయిన వెంటనే పక్షి తగలడంతో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. సేఫ్గా ల్యాండ్ అవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. విమానంలో వైసీపీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. దీంతో విజయవాడ వెళ్లాల్సిన విమానాన్ని రద్దు చేసినట్లు ప్రకటించిన అధికారులు ప్రయాణికులను విజయవాడ చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.
Next Story