మహేష్ విట్టా మెడలో దండలెందుకు వేశారు?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 Sep 2019 6:48 AM GMT
మహేష్ విట్టా మెడలో దండలెందుకు వేశారు?

హైదరాబాద్ : బిగ్ బాస్ షో 61వ ఎపిసోడ్ అసక్తికరంగా సాగింది. కాలేజ్ టాస్క్ లో భాగంగా బాబా భాస్కర్ బెస్ట్ టీచర్ గా, మహేష్ విట్టా బెస్ట్ స్టూడెంట్ గా ఎన్నికయ్యారు. అయితే, వీరిద్దరిని 'ప్రచారమే ఆయుధం' అనే కెప్టెన్సీ టాస్క్‌కి ఎంపిక చేసాడు బిగ్ బాస్.

ఈ టాస్క్ లో భాగంగా మహేష్ విట్టా, బాబా భాస్కర్‌లు ఇద్దరూ కూడా మిగిలిన ఇంటి సభ్యుల దగ్గరకెళ్లి తమని కెప్టెన్‌గా గెలిపించాలని ప్రచారం చేసుకున్నారు. ఇద్దరిలో ఎవరి ప్రచారం నచ్చితే వారికి మిగిలిన కంటెస్టెంట్స్ తమ వద్ద ఉన్న దండను తీసి అతని మెడలో వేయాలి. దీంతో ఎక్కువ దండలు మహేష్ విట్టా మెడ లోనే పడ్డాయి. దీంతో బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్ అయ్యాడు మహేష్ విట్టా.

పునర్నవి, హిమజ ఇద్దరూ బాబా భాస్కర్ మెడలో దండ వేయగా.. వరుణ్ సందేశ్, హిమజ, శివజ్యోతి, రాహుల్, రవి, శ్రీముఖిలు మహేష్ విట్టా మెడలో దండలు వేశారు. ఈ ఎనిమిది మందిలో ఎక్కువ మంది మహేష్ విట్టాకే దండలు వేయడంతో ‘ప్రచారమే ఆయుధం' టాస్క్‌లో మహేష్ విట్టానే విజయకేతనం ఎగరేశాడు.

చెప్పుకోండి చూద్దాం అనే లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌లో హిమజ సంచాలకులుగా వ్యవహరించింది. ఈ టాస్క్‌లో కెప్టెన్‌ మహేశ్‌ ప్లకార్డును పట్టుకుంటాడు కానీ దాన్ని చూడడు. ఇంటిసభ్యులు నేరుగా అక్కడ రాసి ఉన్న పేరును కెప్టెన్‌తో చెప్పించాలి. అందరూ సరిగ్గా చెప్పడంతో లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌ విజయవంతంగా పూర్తయింది.

బిగ్‌బాస్‌ ఇంట్లో అడుగుపెట్టి 60 రోజులు పూర్తయినందున ఫ్యామిలీని మిస్‌ అవుతున్న ఇంటి సభ్యుల కోసం ఓ సర్‌ప్రైజ్‌ సిద్ధం చేశాడు. కానీ, ఇంటి సభ్యులు ఎవరూ మాట్లాడటానికి వీలులేదని మెలిక పెట్టాడు. అనంతరం వారి కుటుంబ సభ్యులను, స్నేహితులను చూపించగా ఇంటి సభ్యులందరూ ఉద్వేగానికి లోనయ్యారు. శ్రీముఖి, శివజ్యోతిలు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. ఇక పార్టిసిపెంట్స్‌ను కలవడానికి వచ్చిన కుటుంబ సభ్యులతో బిగ్‌బాస్‌ గేమ్‌ ఆడించనున్నాడు. వచ్చిన వారితో గేమ్‌ ఆడించి అందులో గెలిచిన ఇద్దరికి మాత్రమే ఇంట్లోకి వెళ‍్లే అవకాశముందని చెప్పాడు. మరి ఆ లక్కీ ఇద్దరు ఎవరు? వేచి చూడాల్సిందే!!

Next Story