రాజ్భవన్లో 'ఎట్ హోం' కార్యక్రమం
By సుభాష్ Published on 26 Jan 2020 1:20 PM GMTరిపబ్లిక్ డే సందర్భంగా ఏపీ రాజ్ భవన్లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ఎట్ హోం కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్, స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసన మండలి చైర్మన్ షరీఫ్, మంత్రులు బొత్స సత్యనారాయణ, రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, వెల్లంపల్లి శ్రీనివాస్, పలువురు ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు. కాగా, ఉమ్మడి రాష్ట్రంగా విడిపోయిన తర్వాత ఏపీలో ఎట్హోం జరగడం తొలిసారి. ఈ కార్యక్రమానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కాగా, ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవం జరిగిన తర్వాత ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
Next Story