ప్లాట్ ఫాం ధర పెంచిన దక్షిణ మధ్య రైల్వే..!
By న్యూస్మీటర్ తెలుగు Published on 28 Sept 2019 7:58 PM ISTహైదరాబాద్: దసరా పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే తమదైన శైలిలొ వాయింపు మొదలు పెట్టింది. ప్లాట్ ఫామ్ ధరను పెంచింది. టికెట్ ధర రూ.10ల నుంచి రూ.30లకు పెంచింది. పెంచిన ధరలు విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి స్టేషన్లలో అమల్లోకి వస్తాయి. ఈ రోజు నుంచి అక్టోబర్ 10 వరకు పెంచిన ధరలు అమల్లో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులకు వీడ్కోలు పలికేందుకు వచ్చే బంధువుల తాకిడిని అరికట్టడానికి..ఆదాయం పెంచుకోవడానికి దక్షిణ మధ్య రైల్వే ప్లాట్ ఫామ్ టికెట్ ధరలు తాత్కాలికంగా పెంచుతుంది. అయితే...గతంలో 10 నుంచి రూ.20లకు పెంచేవారు. ప్రస్తుతం ఏకంగా రూ.30లకు పెంచారు.
Next Story