ఏపీలో భారీగా పెరిగిన కేసులు.. కొత్తగా 161 కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 Jun 2020 7:22 AM GMT
ఏపీలో భారీగా పెరిగిన కేసులు.. కొత్తగా 161 కేసులు

ఏపీలో క‌రోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. గ‌డిచిన 24 గంటల్లో 12,771 సాంపిల్స్ ను ప‌రీక్షించ‌గా.. కొత్త‌గా మ‌రో 161 పాజిటివ్ కేసులు నిర్థార‌ణ అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్ల‌డించింది. కొత్త‌గా న‌మోదైన కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3588 కి చేరింది. ఈ మ‌హ‌మ్మారి వల్ల ఇప్పటి వరకు 73 మంది ప్రాణాలు కోల్పోయారు.

మొత్తం న‌మోదు అయిన కేసుల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 2,323మంది డిశ్చార్జి కాగా.. 1192మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. విదేశాల నుంచి ఏపీకి వచ్చిన వారిలో 131 మందికి కరోనా సోకింది. ఇత‌ర‌ రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన వారిలో 741 మంది కరోనా బారినప‌డినట్లు ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.

Untitled 3 Copy

Next Story