AOBలో బంద్కు పిలుపునిచ్చిన మావోయిస్ట్లు
By న్యూస్మీటర్ తెలుగు Published on 3 Oct 2019 12:04 PM ISTవిశాఖపట్నం: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో నేడు మావోయిస్టు పార్టీ బంద్కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది.
గత నెల 22, 23న గూడెం కొత్తవీధి మండలం గుమ్మిరేవుల పంచాయతీ పరిధిలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల ఘటనలో అయిదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మరొక మహిళా మావోయిస్టు నాయకురాలు గాయాలతో పట్టుబడిన సంగతి తెలిసిందే.
అయితే..మావోయిస్ట్లు మాత్రం పట్టుకుని కాల్చి చంపారని ఆరోపిస్తున్నారు. ఆవిర్భావ వారోత్సవాలకు వస్తుండగా పట్టుకుని ఏకపక్షంగా కాల్చి చంపారని ఆరోపిస్తూ మావోయిస్ట్లు బంద్కు పిలుపునిచ్చారు. మావోయిస్టులు బంద్కు పిలుపునివ్వడంతో సీలేరులో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. బంద్ సందర్భంగా విధ్వంస సంఘటనలకు మావోయిస్ట్లు పాల్పడే అవకాశం ఉన్నట్లు నిఘ వర్గాలు హెచ్చరించాయి. దీంతో ఏవోబీలో పోలీసులు అలర్ట్ అయ్యారు. మావోయిస్టు అగ్రనేతలు ఇప్పటికే ఏవోబీ సరిహద్దులకు చేరుకున్నారని పోలీసులు భావిస్తున్నారు.
మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలైన జీకే వీధి, చింతపల్లి, కొయ్యూరు, జి .మాడుగుల, డుంబ్రిగూడ, పెదబయలు, ముంచింగ్ పుట్ పోలీస్ స్టేషన్ లకు అదనపు పోలీసు బలగాలను అధికారులు తరలించారు. సీలేరు జలవిద్యుత్కేంద్రం, ప్రభుత్వ కార్యాలయాల వద్ద రాత్రివేళల్లో గస్తీ నిర్వహిస్తున్నారు.