సిరిమూవీస్‌ పతాకంపై మరో నూతన చిత్రం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Oct 2019 6:29 AM GMT
సిరిమూవీస్‌ పతాకంపై మరో నూతన చిత్రం

సిరి మూవీస్‌పతాకంపై కె. శిరీషా రెడ్డి నిర్మాతగా ఓ నూతన చిత్రానికి రమేష్-గోపి దర్శకత్వంలో శ్రీకారం చుట్టారు. ఇది నా లవ్ స్టోరీ ఫేమ్ రమేష్- గోపి దర్శకత్వంలో కొరివి పిచ్చిరెడ్డి, సరస్వతి సమర్పణలో సిరిమూవీస్ పతాకంపై.. కె. శిరీషారెడ్డి నిర్మాతగా త్వరలో ఓ నూతన చిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి రమన్, వర్ష విశ్వనాధ్, పావని, దీపికా హీరో హీరోయిన్లుగా నటించనున్నారు. ఈ సందర్భంగా దర్శకులు రమేష్- గోపి.. చిత్ర విశేషాలను తెలుపుతూ..'ఇది నా లవ్ స్టోరీ తర్వాత మా దర్శకత్వంలో తెరకెక్కుతున్న రెండవ చిత్రం ఇది. లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ జోనర్‌లో మంచి సందేశాత్మకంగా ఉంటుంది' అని తెలిపారు.

ముఖ్యంగా ఒకహీరో, ముగ్గురు హీరోయిన్లతో రూపొందుతోన్న స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ ఇది. విలన్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉండి ఆడియన్స్ కి ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది . అలాగే మా చిత్రంతో అల‌నాటి సీనియర్ నటి వాణి విశ్వనాధ్ కూతురు వర్షా విశ్వనాథ్ హీరోయిన్‌గా పరిచయమ‌వడం సంతోషంగా ఉందని దర్శకులు రమేష్‌-గోపి చెబుతున్నారు. ఈ చిత్రానికి నవంబర్ చివరి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు. మా చిత్రానికి మహిత్ నారాయణ్ సంగీత సారథ్యం వహిస్తుండగా.. క్రిస్టోఫర్ జోసెఫ్ సినిమాటోగ్రఫీ భాద్యతలు వహిస్తున్నారు. తప్పకుండా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా సినిమా ఉండబోతుంది' అని రమేష్‌-గోపి అన్నారు.

రమన్, వర్షా విశ్వనాథ్, పావని, దీపికా హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సాంకేతిక వర్గం: బేనర్ : సిరిమూవీస్, సమర్పకులు: కొరివి పిచ్చి రెడ్డి, సరస్వతి, సినిమాటోగ్రఫీ: క్రిస్టోఫర్ జోసెఫ్, సంగీతం: మహిత్ నారాయణ్, నిర్మాత: కె. శిరీషా రెడ్డి, దర్శకత్వం: రమేష్- గోపి.

Next Story