జేసీ దివాక‌ర్‌రెడ్డికి భారీ షాక్‌.. రూ.100కోట్లు జ‌రిమానా

Rs 100 Crore Fine Slapped On JC Divakar Reddy .. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి ఏపీ మైనింగ్

By సుభాష్  Published on  1 Dec 2020 10:14 AM GMT
జేసీ దివాక‌ర్‌రెడ్డికి భారీ షాక్‌.. రూ.100కోట్లు జ‌రిమానా

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి ఏపీ మైనింగ్ అధికారులు ఊహించ‌ని షాక్ ఇచ్చారు. అక్ర‌మ మైనింగ్ వ్య‌వ‌హారంలో రూ.100 కోట్ల జ‌రిమానా విధించాల‌ని నిర్ణ‌యించారు. ఒక‌వేళ ఈ జ‌రిమానా క‌ట్ట‌క‌పోతే ఆర్అండ్ఆర్ చ‌ట్టం కింద ఆస్తుల జ‌ప్తు చేయ‌డతామ‌ని హెచ్చ‌రించారు.

అనంతపురం జిల్లా యాడికి మండలం కోన ఉప్పలపాడులో అక్రమ తవ్వకాలు జరిపి 14 లక్షల మెట్రిక్ టన్నుల దోపిడీ జరిగినట్లు గుర్తించారు. విలువైన లైమ్ స్టోన్‌ను నిబంధనలకు విరుద్ధంగా తవ్వి విక్రయించారని అభియోగాలు నమోదు చేశారు. జేసీ తమ ఇంట్లో పనిచేసే పనిమనుషులు, డ్రైవర్ల పేరుతో త్రిశూల్ సిమెంట్స్ అనుమతులు పొందారని.. అలాగే అనుమతులు వచ్చాక పనిమనుషుల నుంచి కుటుంబ సభ్యులకు వాటాలు బదలాయింపు ప్రక్రియను చేపట్టారనే ఆరోపణలు ఉన్నాయి.

అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలంలోని ముచ్చుకోట అటవీ ప్రాంతంలో దివాకర్‌రెడ్డి కుటుంబీకులు నిర్వహిస్తున్న సుమన, భ్రమరాంబ మైనింగ్‌ సంస్థల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్టు గుర్తించామని అధికారులు గతంలో తెలిపారు. జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన రెండు డోలమైట్‌ మైనింగ్‌ క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా పనులు నిర్వహించడంతో వారికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

Next Story